రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనుల పూర్తికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అయోధ్యలో ఘన స్వాగతం లభించింది. సాకేత్ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భారీ రోడ్షోగా ఆలయానికి బయల్దేరారు.రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు బారులు తీరి జైశ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని కాన్వాయ్పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిరాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజు, శబరిలకు అంకితం చేసిన ఈ ఆలయాలకు విశిష్ఠ ప్రాధాన్యం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa