మంగళవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, లా కళాశాల భవనాల నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన విద్యావాతావరణాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. మహబూబ్ నగర్ ను విద్యా హబ్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని, ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ విశ్వవిద్యాలయాల స్థాయిలో నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa