ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 10:26 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. పలు జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో 19 డిగ్రీలు, పటాన్‌చెరులో 15.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీలు, మెదక్‌లో 14.3 డిగ్రీలు, ఏపీలోని అరకులో 12 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa