ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని అభివర్ణించారు. ధర్మేంద్ర కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదని, ఆయన నిరాడంబరత, వినయానికి ప్రతీక అని కొనియాడారు. ఈ విచారకరమైన సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. "ధర్మేంద్ర జీ మరణం భారత సినిమాలో ఒక శకం ముగింపు. ఆయన ఒక ఐకానిక్ ఫిల్మ్ పర్సనాలిటీ. ప్రతి పాత్రకు తన అద్భుతమైన నటనతో జీవం పోసి, ఆకట్టుకున్నారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు అసంఖ్యాక ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. ధర్మేంద్ర జీ తన నిరాడంబరత, వినయం, ఆప్యాయతతో కూడా ఎంతగానో గౌరవాభిమానాలు పొందారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి" అని ప్రధాని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa