తెలంగాణలోని పత్తి రైతులు ఈ రోజుల్లో పంట అమ్మే ముందు డిజిటల్ గండం ఎక్కుతున్నారు. పండించిన పత్తిని మార్కెట్క లేదా CCIకి అమ్మాలంటే మూడు వేర్వేరు మొబైల్ యాప్లలో నమోదు తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ వల్ల చదువుకున్న యువ రైతులే కాదు, స్మార్ట్ఫోన్ను సరిగ్గా నడపలేని వయోవృద్ధ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో నెట్వర్క్ సమస్య, యాప్లలో టెక్నికల్ లోపాలు ఈ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి.
ముందుగా పంట వేసినప్పటి నుంచి ఈ-క్రాప్ బుకింగ్ యాప్లో పొలం వివరాలు నమోదు చేయాలి. ఈ నమోదు లేకపోతే పంటను ఎవరూ కొనుగోలు చేయరని నిబంధన ఉంది. రెండో దశలో పంట కోత అనంతరం రైతు సేవా కేంద్రంలో సీఎం యాప్ ద్వారా అమ్మకం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు దశలు పూర్తయినా సరిపోదు – మూడో దశగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ప్రత్యేకంగా తయారు చేసిన ‘కపాస్’ యాప్లో మళ్లీ వివరాలు ఎంటర్ చేయాలి.
ఈ మూడు యాప్లు ఒకదానితో ఒకటి పూర్తిగా అనుసంధానం కాలేదు. ఒక యాప్లో నమోదు చేసిన డేటా మిగతా రెండింటిలో ఆటోమేటిక్గా రావడం లేదు. ఫలితంగా రైతు ఒకే వివరాలను మూడు సార్లు టైప్ చేయాల్సి వస్తోంది. చిన్న తప్పిదం జరిగినా అమ్మకం నిలిచిపోతుంది. ఈ డిజిటల్ గండం వల్ల గత వారం రోజులుగా అనేక మండలాల్లో పత్తి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ విధానం రైతులకు భారం కావడంతో పాటు, స్థానిక వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది కూడా ఒత్తిడికి గురవుతున్నారు. మూడు యాప్లనూ ఒకే ప్లాట్ఫామ్లో విలీనం చేయాలని లేదా కనీసం డేటా షేరింగ్ను సజావుగా చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే “డిజిటల్ ఇండియా” అనే పేరుతో రైతులకు మరింత ఇబ్బంది కలిగించినట్టు అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa