ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ ఎన్నికలకి జీవో విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 03:07 PM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ కీలకమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించింది.ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయబడతాయని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa