రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రోడ్లు-భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ ఇంటికి వెళ్లి గాజులు ధరింపజేసి, బొట్టు పెట్టి, గౌరవంగా చీరను అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హురాలికి సంక్రాంతి ముందు చీర చేరాలన్నది మంత్రి సంకల్పం.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం గ్రామంలో శుక్రవారం మంచుకొండ ఎత్తిపోతల పథకానికి చెందిన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరల పంపిణీని శనివారం నుంచే ప్రారంభించి, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ఈ పని యుద్ధప్రాతిపదికన జరగాలని స్పష్టం చేశారు.
సబ్స్టేషన్ పనుల విషయంలోనూ మంత్రి తన దృష్టిని కేంద్రీకరించారు. రూ. కోట్లు వెచ్చించి నిర్మించనున్న ఈ సబ్స్టేషన్ పనులను సంక్రాంతికి ముందే పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన మౌళిక వసతులను త్వరగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ఎత్తిపోతల పథకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ హస్తం మరింత బలంగా కనిపించేలా చేస్తున్నాయి. మంత్రి తుమ్మల నాయకత్వంలో ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి వేగం పుంజుకోవడం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa