ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలని జెడ్సీకి వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 02:49 PM

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని, గత ప్రభుత్వంలో మంజూరైన పనులు కూడా పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. తొమ్మిది డివిజన్లలో సమస్యలు పేరుకుపోతున్నాయని, నిధుల మంజూరులో కూకట్పల్లి నియోజకవర్గంపై జోనల్ కమిషనర్ చిన్న చూపు చూడటం సరికాదని కృష్ణారావు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa