ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేవెళ్ల సమీపంలో మరో రోడ్డు ప్రమాదం ...రెండు కార్లు ఢీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 10:33 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవలే చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ… ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదిలా ఉండగానే…. తాజాగా చేవెళ్ల పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa