ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11న నిరాహార దీక్షను జయప్రదం చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:28 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 11వ తేదీన సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. శనివారం సంఘ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, మల్లికార్జున్ పటేల్, కృష్ణ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa