ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్ విమానాశ్రయంలో ఆలస్యమైన విమానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 05:06 PM

విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన విమానం కోసం శుక్రవారం రాత్రి నుంచి ఎదురుచూస్తున్న దాదాపు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందంటే అధికారుల నుంచి సరైన సమాధానమే రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానంతో పాటు ఢిల్లీ, ముంబై, శివమొగ్గ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించడంపై మండిపడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, దాని ప్రభావం హైదరాబాద్ లోని విమానాశ్రయంపైనా పడిందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa