జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సెటిలర్ ఓట్లను ఆకర్షించడానికి, ప్రత్యర్థులకు ఊహకందని విధంగా పాచికలు సిద్ధం చేస్తున్నారు.దీన్ని భాగంగా, రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అమీర్పేట్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రా సెటిలర్ ఓటర్లలో మంచి స్పందన సాధించింది. తాజాగా ఆయన మరో వ్యూహాత్మక అడుగు ముందుకు వేసి, టీడీపీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు – టీడీపీ అధినేత నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సందర్భంలో, హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే హక్కును మళ్లీ అడ్డుకున్న వారికి మద్దతు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? ఎవరికీ అండగా నిలబడాలో, ఎవరికి ఓటు వేసాలో కార్యకర్తలే నిర్ణయించుకోవాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.అంతేకాక, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు ఘాట్ను తొలగించాలని యత్నించినవారికి టీడీపీ కార్యకర్తలు మద్దతు పలకడం ఎంతవరకు న్యాయమని ఆయన సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబుకు కష్టకాలంలో నిరసన ప్రకటించే అవకాశం ఇవ్వని, అలాగే ఎన్టీఆర్ ఘాట్ వంటి తెలుగు జాతి గౌరవానికి చిహ్నమైన స్థలాలను టార్గెట్ చేసిన శక్తులపై టీడీపీ కార్యకర్తలు తమ వైఖరిని పునర్విచారించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గట్టిగా నొక్కి చెప్పారు.తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ మధ్య గత విభేదాలు ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం, టీడీపీ స్థాపన వెనుక ఉన్న విలువలను గౌరవించే వారికి మాత్రమే మద్దతు ఇవ్వాలనే పరోక్ష సందేశాన్ని ఆయన ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa