ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 12:00 PM

పటాన్‌చెరు జె.పి. ఫార్మ్స్‌లో సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూరోకిడ్స్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొని, సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, సహజ ఎరువుల వినియోగం వంటి అంశాలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యంలోని మహేష్ గారిని మాదిరి ప్రిథ్వీరాజ్ గారు అభినందించారు.విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ అవసరంపై అవగాహన కల్పించారు.ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ చైతన్యం మరియు సుస్థిర వ్యవసాయంపై అవగాహన పెంపొందాలని ప్రిథ్వీరాజ్ గారు సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa