సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిగా ఉన్న ఆర్థిక బిల్లులను ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వేల కోట్ల విలువైన బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.భార్యమైన బకాయిలను నెలలుగా విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈసారి రూ.1,032 కోట్ల బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించబడింది. ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్న సమయంలో, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగులను శాంతపరిచేందుకు ఈ బకాయిలను విడుదల చేసినట్లు సమాచారం.ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలతో పాటు, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బీ శాఖకు చెందిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలు, చర్చల తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన సుమారు రూ.1,031 కోట్ల బకాయిలను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ ప్రజా భవన్లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా విడుదల చేస్తూ, అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలలో రూ.712 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం ఆదేశించారు. అదనంగా కొన్ని మరికొన్ని పెండింగ్ బిల్లులూ విడుదల అయ్యాయి. రూ.10 లక్షల లోపు విలువైన బిల్లుల్ని ప్రత్యేకంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన 46,956 బిల్లులలో రూ.320 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖలోని 3,610 బిల్లులలో రూ.95 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa