ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం, పెళ్లి ఇంట విషాదం 12 మందికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 04:10 PM

హనుమకొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ పెళ్లి బృందంలోని ముగ్గురిని బలిగొంది. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది.వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతికి, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు తరఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి బొలెరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యంలో గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బోర్‌వెల్స్‌ లారీ అదుపుతప్పి బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12 మంది ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa