ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ నేరాలపై చర్యలు చేపట్టాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:58 PM

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొడ్డలిపెట్టుగా మారుతోందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కూడా డీప్‌ఫేక్‌ బారిన పడ్డానని, కొందరు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారని ఆయన వెల్లడించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనర్‌తో కలిసి 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, డీప్‌ఫేక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు."డీప్‌ఫేక్‌ అనేది చాలా ప్రమాదకరమైనది. నా ఫొటోలను మార్ఫింగ్ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారు" అని చిరంజీవి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa