ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో కోతకు గురైన జాతీయ రహదారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 10:00 PM

మొంథా తుపాను వాయుగుండంగా బలహీనపడటంతో తెలంగాణపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కి.మీ., ఖమ్మంకు 110 కి.మీ., ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కి.మీ. దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటలుగా వాయుగుండం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది.నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతిపుర్ సమీపంలో డిండి జలాశయం మత్తడి దుంకుతోంది. దీంతో జాతీయ రహదారి కోతకు గురి కావడంతో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిలిపివేశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లించారు. కోతకు గురైన జాతీయ రహదారిని నాగర్ కర్నూలు ఎస్పీ పరిశీలించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధికారులు సమాచారం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa