ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు : కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:18 PM

TG:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జన బాట' కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కవిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని కరివెన రిజర్వాయర్ ను పరిశీలించారు. కేసీఆర్ హయాంలో 80% పూర్తయిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ముందుకు కదలలేదని ఆమె ఆరోపించారు. పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, వారు ఆయనను క్షమించబోరని కవిత మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa