ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కావడం లేదని.. పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 12:46 PM

TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నీలం రాజు (30) పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు ఈ నెల 11న బావి వద్ద పురుగుమందు తాగి ప్రాణం తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతలో అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించి అతడిని హనుమకొండలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa