ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, 15 గొర్రెలు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 12:43 PM

నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం కౌడిపల్లి, కుల్చారం మధ్య రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొర్రెల యజమాని ఈ ఘటనతో కన్నీరుమున్నీరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa