ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వ్యాధితో ఎంతగానో బాధపడ్డాను

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 04:33 PM

భారతీయ క్రికెట్ ఆటగాడు తిలక్ వర్మ తన కెరీర్‌కు సంబంధించి ఒక షాకింగ్ నిజాన్ని తొలిసారిగా బయటపెట్టాడు. 2022లో తాను ప్రాణాంతకమైన అనారోగ్యం బారిన పడ్డానని, ఆ విషయం ఇప్పటివరకు ఎవరితోనూ పంచుకోలేదని తెలిపాడు. కండరాలు వేగంగా విచ్ఛిన్నమయ్యే 'రాబ్డోమయోలిసిస్' అనే అత్యంత అరుదైన వ్యాధితో తాను బాధపడ్డానని, దానివల్ల తన కెరీర్ మాత్రమే కాదు, ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని గుర్తుచేసుకున్నాడు.ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తిలక్ ఈ విషయాలను పంచుకున్నాడు. "ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా, ఫిట్‌గా ఉండాలనే తపనతో విశ్రాంతి రోజుల్లో కూడా జిమ్‌లో తీవ్రంగా శ్రమించాను. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వలేదు. దీనివల్ల కండరాలు తీవ్ర ఒత్తిడికి గురై విచ్ఛిన్నమయ్యాయి" అని తిలక్ వివరించాడు.బంగ్లాదేశ్‌లో 'ఏ' సిరీస్ ఆడుతున్న సమయంలో ఒక మ్యాచ్‌లో సెంచరీ కోసం ప్రయత్నిస్తుండగా తన కండరాలు పూర్తిగా బిగుసుకుపోయాయని తిలక్ తెలిపాడు. "నా వేళ్లు కదల్లేదు. శరీరం రాయిలా గట్టిగా మారిపోయింది. కనీసం చేతికి ఉన్న గ్లౌవ్స్ కూడా తీయలేకపోయాను. వాటిని కత్తిరించి నన్ను మైదానం నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు" అని ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నాడు. "ఆసుపత్రిలో చేర్చడంలో కొన్ని గంటలు ఆలస్యమైనా ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని వైద్యులు చెప్పారు. నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఐవీ లైన్ కోసం పెట్టిన సూది కూడా విరిగిపోయింది" అని తిలక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్లిష్ట సమయంలో ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాశ్ అంబానీ, బీసీసీఐ వెంటనే స్పందించి తనకు అండగా నిలిచారని, వారి సహాయం వల్లే తాను కోలుకోగలిగానని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa