ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల చదువు కోసం తల్లిదండ్రుల కష్టపడుతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 04:30 PM

లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తన జీవితంలో జరిగిన ఓ సున్నితమైన, తనను ఎంతగానో ప్రభావితం చేసిన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన ఉద్యోగ జీవితం తొలినాళ్లలో ఓ నిరుపేద మహిళ తన మనవడి చదువు కోసం పడిన ఆవేదన తనను తీవ్రంగా కదిలించిందని, ఆ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న జేపీ, ఆ సంఘటన గురించి వివరిస్తూ.. "అది 1983-84 మధ్యకాలం, నాకు పెళ్లైన కొత్త రోజులు. నేను సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు 50 ఏళ్ల వయసున్న ఓ పేద మహిళ, ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బందిగా పనిచేసేది. కొడుకు చనిపోవడంతో మనవడిని తనే పెంచుకుంటోంది. వాడిని ఓ ప్రైవేట్ మిషన్ స్కూల్‌లో చేర్పించాలని ప్రయత్నించింది, కానీ సీటు దొరకలేదు. ఆమె నా దగ్గరికి వచ్చి, ఫీజు కూడా కడతానని చెబుతూ నా కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చింది. ఈ దేశంలో ఓ నిరుపేద కుటుంబం తమ పిల్లల చదువు కోసం కన్నీళ్లు పెట్టుకుని కాళ్ల మీద పడే దుస్థితి ఉందంటే, సమాజంగా మనం సిగ్గుపడాలి. ఆ ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఈ దేశంలో కోట్ల మంది తల్లిదండ్రుల విషాదం అదే" అని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa