తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూ వివాదానికి సంబంధించి నమోదైన కేసులో మరోసారి ఊరట పొందారు. ఈ కేసు 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైంది. అప్పట్లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్య అనే వ్యక్తిపై పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పెద్దిరాజు తన ఫిర్యాదులో, తమకు చెందిన సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు రేవంత్ రెడ్డి సహా మరికొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి న్యాయస్థానాల్లో విచారణకు దారితీసింది.
అయితే తాజా విచారణలో రేవంత్ రెడ్డి, ఇతరులపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో వారికి మళ్లీ ఊరట లభించింది. ఇది రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు న్యాయంగా కలిసొచ్చిన పరిణామంగా విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే పలుసార్లు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి, న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటూ ముందుకుసాగుతున్నారు. సీఎం పదవిలో ఉన్న ఆయనకు ఈ తరహా కేసుల నుంచి విముక్తి లభించడం పాలనలో మరింత స్థిరత్వాన్ని తీసుకురావచ్చని అనేక మంది భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa