నిజామాబాద్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే ప్రధాని మోదీ నాయకత్వంలో గత 11 ఏళ్లలో రెండింతల అభివృద్ధి సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, పసుపు బోర్డు ఏర్పాటు కోసం 40 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న కలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. నిజామాబాద్ ప్రాంత రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీజేపీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరిగిన కుల గణనపై కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల గణనలో తప్పులు జరిగాయని, ముఖ్యంగా బీసీల జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఈ గణన పక్షపాతంతో కూడుకున్నదని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడుతోందని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa