తెలంగాణ రాష్ట్రంలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో శ్రీ సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో అంతర్ వాహినిగా సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమం ఈ పుష్కరాల ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తున్నారు.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విజయవాడ, అమలాపురం నుంచి కాళేశ్వరం వరకు సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ బస్సులను అధికారులు నడుపుతున్నారు. మే 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు వెల్లడించారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాన్స్పోర్ట్ విభాగం ముందస్తు ఏర్పాట్లు చేసి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంది. సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాలని ఆశించే భక్తులు ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa