ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పనులు చేస్తుండగా ,,,జనగామ జిల్లా శామీర్‌పేట్ శివారులో మధ్యయుగం నాటి విగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 09:29 PM

భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి .. అక్కడి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు. అంతే కాకుండా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చు.


ఈ పథకం ద్వారా వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణులు స్థానికంగానే ఉపాధి పొందుతారు. ఇది వారి ఆర్థిక భద్రతకు ఎంతో తోడ్పడుతుంది. చెరువుల తవ్వకం, రోడ్ల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి అనేక పనులు ఈ పథకం కింద జరుగుతాయి. ఇలాంటి పనికి వెళ్లిన కూలీలకు ఓ రోజు ఉదయం, జనగామ జిల్లాలోని శామీర్‌పేట్ గ్రామ శివారులో ఉపాధి హామీ పథకం కింద ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది.. వారి శరీరం చెమటతో తడిసిపోయింది. ఓ చోట గడ్డపారతో మట్టిని తవ్వుతున్న వారికి అకస్మాత్తుగా వారికి ఏదో వస్తువు గడ్డపారకు తాకినట్లు అనిపించింది. ‘ఏమై ఉంటుంది..?’ అనే ఆలోచన వారి మనసులో మెదిలింది. నిన్నటి కష్టం ఈరోజు ఫలిస్తుందా..? భూమి లోపల ఏదైనా నిధి దాగి ఉందా?


కొంత ఉత్సుకతతో.. మరికొంత ఆశతో వారు గడ్డపారను మరొకసారి బలంగా నేలకు గుచ్చారు. ఈసారి మరింత స్పష్టంగా ఏదో లోపల ఉన్నట్లు వారికి తెలిసింది. వారి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.. వారి కళ్లలో ఒక విధమైన మెరుపు కనిపించింది. వారు మరింత జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించడం ప్రారంభించారు. వారి శ్రమకు ప్రతిఫలం దక్కుతుందేమో అనే భావన వారిని మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేసింది.


కొంత సమయం గడిచింది.. వారి కళ్ల ముందు ఒక అస్పష్టమైన ఆకారం మెల్లగా బయటపడుతోంది. అది మట్టి రంగులోనే ఉంది.. కానీ దాని ఆకృతి చాలా వింతగా ఉంది. ఇది కేవలం ఒక పెద్ద రాయి అయి ఉండొచ్చు అనుకున్నిరు. కానీ.. దీంతో మరింత లోతుగా తవ్వుతున్న కొద్దీ ఆ ఆకారం స్పష్టంగా కనిపించడం మొదలైంది. మట్టిలో మెరుస్తూ ఒక పురాతన విగ్రహం వారి కళ్ల ముందు సాక్షాత్కరించింది.


ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి గుమిగూడారు. విషయం స్థానిక చరిత్ర పరిశోధకులకు తెలియడంతో వారు కూడా వెంటనే చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. వారి ప్రాథమిక అంచనా ప్రకారం.. అది మధ్యయుగం నాటి విగ్రహం అయి ఉండొచ్చని భావించారు. అధికారులు ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ.. ఆ విగ్రహం ఎక్కడిది? దాని వెనుక ఉన్న కథ ఏమిటి..? అనేది తెలియలేదు. ఈ సంఘటన శామీర్‌పేట్ గ్రామంలో ఒక పెద్ద మిస్టరీగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa