తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె స్థానంలో కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే శాంతి కుమారికి రేవంత్ సర్కార్ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్గా నియమించారు. సీఎస్గా శాంతి కుమార్ రిటైర్ అయిన వెంటనే.. కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు.
1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతి కుమారి తన సుదీర్ఘమైన కెరీర్లో అనేక కీలకమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. వివిధ జిల్లాలకు కలెక్టర్గా, ఇతర ముఖ్యమైన పరిపాలనా పదవులు కూడా నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్యారోగ్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె విశేష కృషి చేశారు. కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, ఈ కీలకమైన రెవెన్యూ శాఖకు ఆమె కమిషనర్గా పనిచేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడానికి ముందు.. అటవీ, పర్యావరణ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. జనవరి 12, 2023న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి శాంతి కుమారే కావటం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగినా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆమెనే సీఎస్గా కొనసాగించారు. తాజాగా ఆమె సేవలను వినియోగించుకోవాలని భావించి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్గా నియమించారు.
ఇక తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావుకు అభినందనలు తెలియజేశారు. శాంతి కుమారి రిరైట్ అయిన వెంటనే రామకృష్ణారావు సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు.. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa