ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీఐ పై మండిపడ్డ రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 12:37 PM

ఈసీఐ పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈసీఐ రాజీపడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు."మహారాష్ట్రలో అర్హులైన వయోజనుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం రెండు గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం భౌతికంగా అసాధ్యం" అని రాహుల్ అన్నారు. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందని, ఆ లెక్కన చూసినా అర్థరాత్రి దాకా పోలింగ్ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోగ్రఫీని తాము కోరితే, ఈసీఐ నిరాకరించడమే కాకుండా, అసలు వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa