ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంచ గచ్చిబౌలి భూములపై ఐఏ ఫోటో రిట్వీట్.. స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 07:43 PM

తెలంగాణ సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ చిక్కుల్లో పడ్డారు ఏఐ ఆధారిత గిబ్లీ ఫోటో ఆమెకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. గిబ్లీ ఫోటోను ఆమె ట్విట్టర్ ఎక్స్‌లో రీట్వీట్ చేయగా.. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఫేక్ ప్రచారం చేశారంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా కంచ గచ్చిబౌలి భూముల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని భావించగా.. అవి హెచ్‌సీయూ భూములని విద్యార్థులు ఆందోళన చేశారు. అది అటవీ భూమి అని అక్కడ అరుదైన వృక్ష సంపద, జంతువులు ఉన్నాయంటూ పర్యావరణవేత్తలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు కలుగజేసుకొని ఎటువంటి పనులు చేపట్టవద్దంటూ స్టేటస్ కో విధించింది.


ఇక కంచ గచ్చిబౌలిలో బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కడ పర్యావరణ విధ్వంసం, జంతుజాలం ఆవాసం కోల్పోయాయని నెటిజన్లు రకరకాల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, ఫోటో ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడింది. వీరి వెనక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ఆరోపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వాటిలో చాలా వరకు ఫేక్, ఏఐ ఆధారిత ప్రచారమే ఉందని సర్కార్ వెల్లడించటంతో తాము చేసిన పోస్టులను కొందరు నెజిటన్లు తొలగించారు. ఈ క్రమంలోనే కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు హైదరాబదాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలికి సంబంధించిన గిబ్లీ ఇమేజ్‌ను రీపోస్ట్ చేసిన స్మితా స్మితా సబర్వాల్‌కు సైతం తాజాగా నోటీసులు జారీ చేశారు.


మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్‌కు బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa