కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. తన ఓటమి తేలడంతో నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి విజయాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. 63,404 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి తనను గెలిపించారని గెలుపొందిన అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావంతో బీజేపీ అభ్యర్థులం విజయాలు సాధిస్తున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa