ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ నీతి, నిజాయతీకి ప్రజలు పట్టం కడుతున్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:20 PM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి గెలుపు కోసం చాలామంది కష్టపడ్డారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలిచారని, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇది తమకు నాలుగో విజయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు, నిన్న టీచర్, నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మోదీ నీతి, నిజాయతీతో కూడిన పాలనను గుర్తించి ప్రజలు పట్టం గడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమలు, ఉద్యోగాల భర్తీ, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంజిరెడ్డి గెలుపు నేపథ్యంలో కరీంనగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అక్కడకు వచ్చిన బండి సంజయ్‌కి అంజిరెడ్డి స్వాగతం పలికారు. బండి సంజయ్, అంజిరెడ్డిలను కార్యకర్తలు తమ భుజాలపై కూర్చోబెట్టుకొని ఊరేగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa