|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 10:39 AM
విశాఖలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుఘర్కు చెందిన శంకర్రావుకి మధురవాడకు చెందిన రాజరాజేశ్వరితో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె తేజ అనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో శంకర్రావుతో తరచూ గొడవలు జరిగేవి. ఇక శంకర్రావు అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు తేజ, తమ్ముడు వాసుతో కలిసి ఈనెల 1న శంకర్రావును హతమార్చింది. పైగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించింది. అయితే ఈ కోసు దర్యాప్తులో అసలు విషయం బటపడిందని పీఎంపాలెం పోలీసులు తెలిపారు.
Latest News