క్రెడిట్ కార్డు రూల్స్ చేంజ్.. వినియోగదారులకు కొత్త నిబంధనలు!
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 10:25 PM

దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల వినియోగ విధానం, అలాగే కొన్ని లావాదేవీలపై విధించే ఛార్జీల్లో సవరణలు ఉండనున్నాయి. ఇప్పటికే Axis Bank, YES Bank, SBI Card తమ కస్టమర్లకు ఈ మార్పుల గురించి సమాచారం అందించాయి. అందువల్ల క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నియమాలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సరిచేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఏప్రిల్ 12 నుంచి ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటిహెచ్ సేవల చెల్లింపులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో పొందగలిగే గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితిని బేస్ క్యాష్‌బ్యాక్ క్యాప్‌తో అనుసంధానం చేయనున్నారు. మరోవైపు ఫుడ్, గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు Swiggy, Zomato, BigBasket వంటి ప్లాట్‌ఫారమ్‌లపై అందిస్తున్న 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను నిలిపివేయనున్నారు. బదులుగా Zomato, Blinkit, District by Zomato వంటి సేవలపై 10 శాతం వాల్యూ-బ్యాక్ ఇవ్వనున్నారు.ఇక ఏప్రిల్ 1 నుంచి YES Bank యుటిలిటీ బిల్లులు మరియు ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, అదనపు ఛార్జీలను అమలు చేయనుంది. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని మించితే 1 శాతం అదనపు ఛార్జీ విధిస్తారు. కార్డు రకాన్ని బట్టి ఈ పరిమితులు నిర్ణయించబడ్డాయి. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులకు రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితి ఉంటుంది. ఈ పరిమితిని దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1 శాతం ఫీజు వర్తిస్తుంది. అలాగే టోల్, బ్రిడ్జ్ వంటి ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపుల విషయంలో కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1 శాతం ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీపై గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే ఫీజు విధిస్తారు.ఇదే సమయంలో SBI Card కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానంలో మార్పులు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రివార్డ్ పాయింట్లను 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే వినియోగించుకోవాలి. అయితే Air Indiaతో అనుబంధమైన ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్ వంటి కొన్ని ప్రత్యేక కార్డులకు ఈ కొత్త నియమాల నుంచి మినహాయింపు ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

Latest News
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 04:03 PM
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 03:52 PM
India is entering new phase in global trade, says Piyush Goyal Tue, Mar 17, 2026, 03:43 PM
Maruti Suzuki India gets Rs 5,786 crore tax notice Tue, Mar 17, 2026, 03:39 PM
NPCI expands its UPI acceptance in Sri Lanka to boost economy, tourists' experience Tue, Mar 17, 2026, 03:32 PM