|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 03:18 PM
శరీర పుష్టి కోసం యువత ప్రోటీన్ షేక్స్, సప్లిమెంట్లను విరివిగా వాడుతున్నారు. అయితే, అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, అవి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ప్రోటీన్ వాడకం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని, కొన్ని సప్లిమెంట్లలోని చక్కెర వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శరీరానికి రోజుకు కిలో బరువుకు 0.8-1 గ్రాము ప్రోటీన్ సరిపోతుందని, సహజ ఆహారంపై ఆధారపడాలని సూచించారు.
Latest News