|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:06 PM
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. మార్చి 9న, ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్జిమ్ను తల్లిగారింటి నుంచి తన ఇంటికి తీసుకువస్తుండగా, మొరాదాబాద్లోని బిలారి బస్టాండ్లో ఆమె పకోడీలు అడిగింది. ప్రీతమ్ పకోడీలు తెచ్చేలోపే రిమ్జిమ్ అదృశ్యమైంది. బస్టాండ్ అంతా వెతికినా ఆమె కనిపించకపోవడంతో, ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిమ్జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానిస్తున్నాడు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, ఆమె మొబైల్ లొకేషన్ను ట్రాక్ చేస్తున్నారు.
Latest News