|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:38 PM
రాష్ట్రములో పర్యాటక రంగానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ గదులను సిద్ధం చేయాలని, హోమ్ స్టేలను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పాపికొండలు, సూర్యలంకను మరో గోవాలా, గండికోటను భారత్కే గ్రాండ్ కాన్యన్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. తిమ్మమ్మ మర్రిమాను, కంభం చెరువు వంటి చారిత్రక ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు. కంటెంట్ క్రియేషన్ను ప్రోత్సహించేందుకు అమరావతిలో ఒక 'క్రియేటివ్ సిటీ'ని ఏర్పాటు చేస్తామని, ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
Latest News