|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:49 PM
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్లు మార్చి 4, 5 తేదీలలో కోల్కతా, ముంబైలలో జరగనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, రిజర్వ్ డే (మార్చి 6)న నిర్వహిస్తారు. అదనంగా 90-120 నిమిషాల సమయం కేటాయిస్తారు. కనీసం 10 ఓవర్ల ఆట జరిగితేనే ఫలితం తేలుతుంది. రెండు రోజులు వర్షం పడితే, సూపర్-8 పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్కు చేరే అవకాశం ఉంది, భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
Latest News