|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:31 PM
టీ20 వరల్డ్కప్ 2026లో టీమిండియా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సూపర్ 8లో ఓటమి తర్వాత భారత్ సెమీస్ చేరదని చెప్పిన అమీర్ అంచనా తప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాకిస్థానీ షో ‘హార్నా మనా హై’లో పాల్గొన్న ఆయన, భారత్ ఫీల్డింగ్ బలహీనంగా ఉందని విమర్శించారు. బుమ్రా తప్పా మిగతా బౌలర్లు పరుగులు ఇచ్చారని అన్నారు. హార్దిక్ పెద్ద జట్లపై రాణించడని విమర్శించారు. వెస్టిండీస్ సమర్థవంతంగా ఆడిందని అభిప్రాయపడ్డారు.
Latest News