|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 08:37 PM
రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. Hyderabad Metro Rail ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న మెట్రోను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా, Telangana Vaidya Vidhana Parishad పేరును మార్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఇకపై ఈ సంస్థను “డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్”గా పిలవనున్నారు. అలాగే టీవీవీపీ పరిధిలో ఉన్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయాలు ఈరోజు సీఎం Revanth Reddy అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనపై కూడా కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో జనగణనను పారదర్శకంగా నిర్వహించేందుకు సుమారు 89 వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రజల వివరాల సేకరణ కోసం 34 ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వే ఫారాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.మే 11 నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభించి జూన్ 9 నాటికి పూర్తిచేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలి దశ జనగణన అనంతరం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ జనగణన నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.మే 11న ఇండ్ల గణన ప్రక్రియను ప్రారంభించి జూన్ 9 వతేదీ వరకూ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలిదశ జనగణన పూర్తైన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండోదశ జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Latest News