|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:03 PM
అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లైంగిక కుంభకోణం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, ఈ వ్యవహారం భారత్కు విస్తరించడం కలకలం రేుతోంది. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారసుడితో ఎప్స్టీన్కు సంబంధాలున్నట్టు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ ఓ సంచలన నివేదిక ప్రచురించింది. ఒకప్పుడు వ్యాపారవేత్తగా వెలుగు వెలిగిన రియలన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, ఎప్స్టీన్ మధ్య సందేశాలు 2017 ప్రారంభం నుంచి 2019 వరకు కొనసాగినట్టు అతడిపై అభియోగాలకు కొన్ని నెలల ముందు పత్రాలు సూచిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచ వ్యవహారాలు, వ్యాపారం, మహిళల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారని, వ్యక్తిగతంగా కలవడానికి ప్రణాళికలు కూడా వేసుకున్నారని నివేదిక పేర్కొంది. అంబానీ కుటుంబం గురించి అనేక పుస్తకాల కోసం ఎప్స్టీన్ 2017లో ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు తెలిపింది. అదే ఏడాది మార్చి 9న ఎప్స్టిన్, అనిల్ అంబానీ మధ్య జరిగిన మేసేజ్లలో.. ‘మీరు ఎవరిని సూచిస్తారు?’ అని అనిల్ అంబానీ అడిగారని.. ‘మీ పర్యటనను సరదాగా సాగడానికి అందంగా పొడుగ్గా ఉండే స్వీడన్ మహిళను ఏర్పాటు చేస్తాను’ అని ఎప్స్టీన్ రిప్లయ్ ఇచ్చాడని. దీనికి 20 సెకెన్లలోనే ‘ఏర్పాటు చేయండి’ అని అంబానీ స్పందించారని ఆ నివేదిక పేర్కొంది.
అలాగే, 2018లో పారిస్లో ఇద్దరూ కలుద్దామని చర్చించుకున్నట్ుట అనిల్ అంబానీ, ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫోన్ నెంబర్ మధ్య జరిగిన టెక్ట్స్ మెసేజ్లను బట్టి తెలుస్తోంది. కానీ, ఇద్దరూ కలవలేకపోయారు. జనవరి 2018లో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డోనాల్డ్ ట్రంప్ స్పందన గురించి కూడా మాట్లాడుకుంటున్నారని ఆ పత్రాలు చెబుతున్నాయి..
తర్వాత 2019 మేలో న్యూయార్క్ పర్యటనకు వస్తున్నట్టు అనీల్ అంబానీ చెప్పగా.. ఎప్స్టీన్ ఆహ్వానం పలుకుతూ... ‘‘ఎలాంటి వ్యక్తులను మీకు కలవాలనుకుంటున్నారో చెప్పండి’ అని రిప్లయ్ ఇచ్చారని తెలిపింది. మన్హట్టన్లోని అప్పర్ ఈస్ట్ సైడ్లోని ఎప్స్టీన్ ఇంట్లో సమావేశం జరిగినట్లు ఆయన సహాయకులు ధ్రువీకరించినట్టు పత్రాలు చూపిస్తున్నాయని నివేదిక వివరించింది. కాగా, దీనిపై స్పందించడానికి అనిల్ అంబానీ ప్రతినిధి నిరాకరించాడు.
తన పరపతి పెంచుకోడానికి వ్యాపార, రాజకీయ ప్రముఖులకు మైనర్లను ఎరగవేసినట్టు ఆరోపణలను ఎప్స్టీన్ 2008లో అంగీకరించారు. ఆ తర్వాత కూడా అతడి విస్తృత వ్యాపార, సామాజిక సంబంధాల కొనసాగినట్టు తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలు బట్టబయలు చేశాయి. బ్లూమ్బెర్గ్ గతంలో సేకరించిన వేలాది మెయిళ్ల ప్రకారం.. ఎప్స్టీన్ మార్చి 4, 2017న ఆర్డర్ చేసిన 'అంబానీ అండ్ సన్స్' 'స్టార్మ్స్ ఇన్ ది సీ విండ్: అంబానీ వర్సెస్ అంబానీ' వంటి డిజిటల్ పుస్తకాలు ఆ కుటుంబంలో గొడవలు, వారి వ్యాపార సామ్రాజ్యం గురించి ఆయన ఒక అవగాహన వచ్చి ఉండొచ్చని పేర్కొంది.
Latest News