|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 10:23 AM
భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని చారిత్రాత్మక విజయంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను అందుబాటులోకి తెస్తుంది. MSMEలు, రైతులు, మత్స్యకారులతో పాటు దుస్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్, తోలు, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, చేతివృత్తుల రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై భారీ సుంకాలు విధిస్తామని బెదిరించిన సమయంలో భారత్, కెనడా కూడా దగ్గరవుతున్నాయి. ఇప్పుడు కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీ కూడా భారత్ను సంప్రదించారు. ఇటీవల కార్నీ మార్చిలో భారత్ సందర్శించవచ్చని, నవంబర్ 2025 నుండి నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా కార్నీ పర్యటన సందర్భంగా కెనడా భారత్తో రూ.25,000 కోట్ల (సుమారు 25 బిలియన్ USD) విలువైన యురేనియం ఒప్పందంపై సంతకం చేయవచ్చు. మరోవైపు భారత్ అనేక దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించింది. చమురు సరఫరాలను కూడా ప్రారంభించింది. ఇది అమెరికా అధ్యక్షుడి ఆందోళనను మరింత పెంచుతోంది.
Latest News