వారి ఆధార్ కార్డులన్నీ రద్దు.... ఏకంగా 2.5 కోట్ల కార్డులు డీయాక్టివేట్
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:08 PM

ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది. చనిపోయిన వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తున్నామని, ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి జితిన్ ప్రసాద బుధవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు ఆధార్ ప్రక్షాళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా చనిపోయిన వారి కార్డులన్నింటిని రద్దు చేస్తున్నట్లు వివరించారు.


ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా ఆధార్ రికార్డ్ సాధించింది. దాదాపు 134 కోట్ల మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే, మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలను పొందుతున్నారని, ఇతర మోసాలకు వారి కార్డులను ఉపయోగిస్తున్నారని గుర్తించిన క్రమంలో ఇలాంటి మోసాలను నిరోధించేందుకు ఆయా ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ ప్రక్రియ చాలా అవసరమని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఆధార్ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్, కొత్త ఆధార్ యాప్ వంటివి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.


 ఆధార్ నంబర్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఇప్పటికే చాలా రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ చేసుకునే సర్వీసెస్, ట్రాన్సాక్షన్ల సమయంలో లబ్ధిదారు భౌతికంగా ఉన్నట్లు నిర్దేఱించే లైవ్ నెస్ డిటెక్షన్ ఫీచర్ తో ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్ లైన్ ఈ- కేవైసీ వంటివి అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ ఎవరితోనూ పంచుకోదని, డేటాను ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్లో భద్రపరచడం తప్పనిసరి చేసినట్లు స్పష్టం చేశారు.


'ఐడెంటిటీ మోసాలు జరగకుండా, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులు లేకుండా చూసేందుకే మరణించిన వారి ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయాలి. ఇందులో భాగంగా 2.5 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను రద్దు చేశాం' అని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. డేటాబేస్ పారదర్శకంగా ఉండడం సహా అర్హులైన వారికే ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇది ఒక కీలక అడుగుగా పేర్కొన్నారు. ఆధార్ కార్డులు పొరపాటున డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు.


Latest News
Congress now captive of divisive forces: Assam CM Tue, Feb 17, 2026, 02:43 PM
After 'all talk' jibe, Pakistan Army signals curtains for Mohsin Naqvi Tue, Feb 17, 2026, 02:41 PM
Coast Guard apprehends Bangladeshi boat, 28 fishermen in Bay of Bengal Tue, Feb 17, 2026, 02:38 PM
Blast inside mine kills two in Afghanistan's Badakhshan Tue, Feb 17, 2026, 02:33 PM
Ready-made garment export figures show resilience of apparel sector: AEPC Tue, Feb 17, 2026, 02:23 PM