|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:35 PM
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... నిన్న రాత్రి కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్కుమార్ (20), కొమిరి ఏడుకొండలు (18), గాజుల వారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్ అలియాస్ సునీల్ (20) ముగ్గురూ కలిసి పల్సర్ బైక్పై సినిమా చూడడానికి రాజమండ్రి బయలుదేరారు. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ (34) యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, రోడ్డు కం రైలు బ్రిడ్జి 104వ స్తంభం వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్షయ్కుమార్, సునీల్, లక్ష్మీనారాయణలకు తలలకు తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుకొండలుకు స్వల్ప గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పట్టణ సీఐ పి.విశ్వం సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Latest News