|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:19 PM
ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మయన్మార్కు చెందిన 11 మంది సభ్యుల నేర ముఠాపై చైనా కఠిన చర్యలు తీసుకుంది. వీరిపై వేలాది కోట్ల విలువైన స్కామ్లకు పాల్పడటంతో పాటు, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు తీసిన ఆరోపణలున్నాయి. ఉత్తర మయన్మార్లోని మింగ్ ఫ్యామిలీ సహా నాలుగు కుటుంబాలు ఈ నేరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చైనా మీడియా పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారించిన వెంజౌ సిటీ న్యాయస్థానం 11 మందిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది.ఉత్తర మయన్మార్లో ఇంటర్నెట్ స్కామ్లు, వ్యభిచారం, మాదకద్రవ్యాల రవాణాలో కొన్ని కుటుంబాలు ఆరితేరాయి. ఇందులో మింగ్ ఫ్యామిలీ (Ming family) సహా నాలుగు కుటుంబాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మయన్మార్ సరిహద్దులోని స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో వేల మందిని నియమించుకొని ఆన్లైన్ స్కీములతో (Online schemes) మోసాలు, నేరాలకు పాల్పడుతున్నట్లు చైనా మీడియా పేర్కొంది. స్థానిక ప్రభుత్వంలోనూ ఈ కుటుంబాలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది.
Latest News