|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:08 PM
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో తాజాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సహాయం చేస్తామని లిఫ్ట్ ఇచ్చి, ఆపై కదిలే కారులోనే ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశారు.బాధిత మహిళ తన గమ్యస్థానానికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తుండగా నిందితులు తమ కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికారు. ఆమె కారు ఎక్కగానే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. నిర్మానుష్య ప్రాంతాల గుండా కారును నడుపుతూ, కదిలే వాహనంలోనే ఆమెపై విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు.బాధిత మహిళ ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన ఆరా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Latest News