ప్రియాంక గాంధీ చెప్పిన కథకు పగలబడి నవ్విన మోదీ, రాజ్‌నాథ్!
 

by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:40 PM

వాడివేడిగా సాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన టీ పార్టీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ పార్టీ హాజరయ్యారు. ఈ టీ పార్టీలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. శీతాకాల సమావేశాలు వాడివేడిగా, వాగ్వాదాలు, వాకౌట్‌లతో సాగాయి. కానీ, స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన టీ పార్టీ మాత్రం ఆహ్లాదకరంగా సాగింది. దాదాపు మూడు వారాల పాటు తీవ్ర రాజకీయ ఆరోపణలు, ప్రతివిమర్శల తర్వాత ఎంపీలు కాస్త సేదతీరేందుకు ఇది చక్కని అవకాశాన్ని కల్పించింది.


ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గైర్హాజరీతో కాంగ్రెస్ నుంచి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ఓ ఫోటోలో ఆమె స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కూర్చుని కనిపించారు. స్పీకర్ టీ పార్టీ అనేది ప్రతి సమావేశం ముగిసిన తర్వాత స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసే ఒక సంప్రదాయ కార్యక్రమం. ఈరోజు జరిగిన సమావేశం సుమారు 20 నిమిషాల పాటు కొనసాగింది. అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య సరదా సంభాషణలు చోటుచేసుకున్నాయి.


ప్రియాంక గాంధీ తన నియోజకవర్గం వయనాడ్ నుంచి తెచ్చే ఒక మూలికను అలెర్జీలను నివారించడానికి ఉపయోగిస్తానని ఎంపీలతో చెప్పారు. ఆమె మాటలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్ నవ్వారని సమాచారం. ఇటీవల ప్రధాని ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటనల గురించి కూడా ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఆ పర్యటనలు బాగున్నాయని మోదీ బదులిచ్చారు.


సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సూలే, సీపీఐ నేత డి. రాజా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ సమావేశాలు కొంచెం ఎక్కువ కాలం నిర్వహిస్తే బాగుండేదని సూచించారు. దానికి ప్రధాని మోదీ స్పందిస్తూ..‘మీకు గొంతు నొప్పి రాకూడదనే సమావేశాలను తక్కువ రోజులు నిర్వహించాం’ అని చమత్కరించినట్టు సమాచారం. సభలో యాదవ్ గట్టిగా వాదించిన విషయాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్య చేశారని తెలిసింది.


ఆర్ఎస్పీ (ఏ) నేత ఎన్.కె. ప్రేమచంద్రన్ వంటి కొందరు ప్రతిపక్ష ఎంపీలను సభకు బాగా సిద్ధమై వచ్చినందుకు మోదీ ప్రశంసించారు. పాత భవనంలో ఉన్నట్టుగా కొత్త పార్లమెంట్ భవనంలోనూ ఉన్నట్లుగా ఎంపీల కోసం ఒక సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేయాలని కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రధానిని కోరారు. పాత భవనంలో ఎంపీలు, మాజీ ఎంపీలు తరచుగా చర్చల కోసం సమావేశమయ్యేవారు. దీనికి మోదీ ‘అది పదవీ విరమణ చేసినవారి కోసం మీరు ఇంకా చాలా సేవ చేయాల్సి ఉంది’ అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్య ఎంపీలలో నవ్వులు పూయించిందని సమాచారం.


ప్రియాంక గాంధీ స్పీకర్ టీ పార్టీకి హాజరు కావడం, గతంలో రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు హాజరు కాకపోవడానికి భిన్నంగా ఉంది. గతంలో స్పీకర్ ప్రతిపక్ష ఎంపీలను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ, ప్రతిపక్ష నాయకులు టీ పార్టీని బహిష్కరించారు. దీనిపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు. ఈసారి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, శీతాకాల సమావేశాలలో స్పీకర్ ప్రతిపక్షానికి న్యాయంగా వ్యవహరించారు కాబట్టి విపక్ష ఎంపీలంతా టీ పార్టీకి హాజరు కావాలని నిర్ణయించారని సమాచారం.

Latest News
Drought continues to impact millions in Somalia: UN Tue, Dec 23, 2025, 11:08 AM
Indian rupee stable in real effective terms, forex reserves adequate: RBI Tue, Dec 23, 2025, 11:04 AM
Piyush Goyal lauds public sector banks, calls them key to MSME growth Tue, Dec 23, 2025, 11:01 AM
TN Assembly polls: OPS camp to meet in Chennai Tue, Dec 23, 2025, 10:58 AM
Neres inspires Napoli to win third Italian Super Cup title Tue, Dec 23, 2025, 10:54 AM