|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:27 PM
రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.పీపీపీ విధానంలో కళాశాలలు నిర్మించినప్పటికీ, అవి ప్రభుత్వ వైద్య కళాశాలల పేరుతోనే పనిచేస్తాయని సీఎం హామీ ఇచ్చారు. "పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేశారని కొందరు విమర్శిస్తున్నారు. కానీ నిబంధనలు పెట్టేది, నిర్దేశించేది ప్రభుత్వమే. ఈ కళాశాలల్లో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి, సీట్లు కూడా పెరుగుతాయి," అని చంద్రబాబు వివరించారు.
Latest News