|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:05 PM
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు.బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (MPW) 2025' కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు.
Latest News