|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 05:24 PM
నారా లోకేశ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, త్వరలో విశాఖపట్నానికి ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా వైజాగ్ ప్రజల్లో తీవ్ర కుతూహలం నెలకొంది."వైజాగ్ సిద్ధంగా ఉండు. ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు. వారెవరో ఎవరైనా ఊహించగలరా అంటూ లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిన్న పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వస్తున్నది క్రీడా రంగానికి చెందినవారా, లేక టెక్నాలజీ లేదా వ్యాపార రంగంలోని దిగ్గజాలా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి వెల్లడించే లోకేశ్, ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. విశాఖను అంతర్జాతీయంగా మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకే ఈ కార్యక్రమం అని పలువురు భావిస్తున్నారు. ఆ ప్రపంచ ఛాంపియన్లు ఎవరు, వారు ఏ రంగంలో నిష్ణాతులు అనే వివరాలు తెలియాలంటే మంత్రి నుంచి రాబోయే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
Latest News