|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:36 PM
AP: రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని వినుకొండలో గురువారం నిర్వహించిన రైతు విజ్ఞాన యాత్రకు ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రగతిని రాష్ట్ర ప్రగతిగా కూటమి ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకోసమే రైతుల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Latest News